రాష్ర్ట సంపదనంతా దోచుకున్నది కేసీఆరే: మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: ‘‘రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. అవినీతి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారా?’’ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. జూన్‌ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ‘‘జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించారు. ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయి. ఎల్బీనగర్‌ ఆస్పత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరాం. ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదు. నల్గొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది’’ అని విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, వేసవిలో వడగళ్ల వాన కారణంగా పంటనష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్ల పరిహారం చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.
Spread the love