ఆసరా పెన్షన్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ఆసరా’ లబ్ధిదారులకు ఫస్ట్ వీక్‌లో పింఛన్లు అందేలా సర్కారు ప్రణాళిక రూపొందించింది. గత శనివారం నుంచే పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మంగళవారం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి. కాగా, ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటివారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

Spread the love