సిడ్నీ మాల్ లో కత్తులతో దాడి..

 

నవతెలంగాణ – సిడ్నీ: ఆస్ట్రేలియా లోని సిడ్నీలో అతి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ షాపింగ్ మాల్‌లోకి చొరబడి కొందరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురైనట్లు స్థానికమీడియా కథనాలు తెలిపాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం అందింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితులపై కాల్పులు జరిపారు.

Spread the love