![](https://navatelangana.com/wp-content/uploads/2023/09/Ramagiri-1.-.jpg)
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండల బిజే వైఎం అధ్యక్షుడిగా కొండు లక్ష్మన్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంథని నియోజకవర్గ ఇన్చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకొని నియమించినందుకు సునీల్ రెడ్డికి అదేవిధంగా సమస్త బీజేపీ నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అదేవిధంగా మంథని నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులు ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ ముంబై నగరం వైపు వలసలు పోతున్నారని, ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ నిరుద్యోగు యువకులు ఎక్కువ వలసలు వెళ్తా ఉన్నారనీ, ఈ వలసల నిరోధానికి సునీల్ రెడ్డినీ ఎమ్మెల్యేగా గెలిపించడం ద్వారా ఇక్కడ పరిశ్రమలు వస్తాయని తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి రానున్న ఎలక్షన్లలో సునీల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.