పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలి

– మాజీ జెడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు 
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి ఎంపీగా బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి  పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు మండలంలో మల్లారం గ్రామంలో  బీఆర్ఎస్ నాయకులు బుధవారం కార్నర్ సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా  పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరారు.ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కొప్సన్ ఆయూబ్ ఖాన్,పిఏసిఎస్ చైర్మన్ రామారావు, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,తాజాద్దీన్, యాదగిరి రావు,లింగన్నపేట శ్రీనాత్, రాజేశం,కోట లింగయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love