కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా  కొరిమి ఓంకారం 

– మున్సిపల్ పట్టణ అధ్యక్షులుగా అనంత చంద్రశేఖర్ గౌడ్ 
నవతెలంగాణ – చండూరు 
మండలంలోని ఉడతల పల్లి గ్రామానికి చెందిన  కొరిమి ఓంకారం  కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్  పట్టణ అధ్యక్షులుగా  అనంత చంద్రశేఖర్ గౌడ్  లను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  హైదరాబాద్ తన నివాసంలో వారి నియామకపత్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పార్టీ అభివృద్ధి దిశగా కృషి చేస్తూ   ప్రభుత్వం అందించి 6 గ్యారంటీల్లా సంక్షేమ పథకాలు   వివరించి  ప్రజల్లోకి తీసుకెళ్తామని,  తమ ఎన్నికకు సహకరించిన దోటి వెంకటేష్ యాదవ్,  మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు,  డాక్టర్ కోడి  శ్రీనివాసులు , గండూరి జనార్ధన్  కీ కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love