నవతెలంగాణ – హైదరాబాద్: తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. కొన్ని టీవీ ఛానళ్లు, కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానళ్లకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం లీగల్ నోటీసులు పంపించారు. అవి పక్కా ప్రణాళికతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్కు సైతం లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. తనకు సంబంధమే లేని అనేక అంశాల్లో తన పేరును, ఫొటోలను వాడుకుంటున్న ఆ ఛానళ్లు.. దురుద్దేశ ప్రచారాంశాలను తొలగించకుంటే పరువు నష్టం కేసులు వేస్తానని వెల్లడించారు.