రెండో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా లింగాల శ్రీనివాస్ 

నవతెలంగాణ-బెజ్జంకి : మండల కేంద్రానికి చెందిన లింగాల శ్రీనివాస్ రెండో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకమైయ్యారు.బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ హాజరై లింగాల శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు.తనపై నమ్మకంతో రెండో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమించిన కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపునకు శాయశక్తుల కృషి చేస్తూ..తన నియామకానికి సహకరించిన మండల నాయకులకు లింగాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.నాయకులు ఒగ్గు దామోదర్, రత్నాకర్ రెడ్డి, మంకాల ప్రవీణ్,శానగొండ శరత్,సోమ రామిరెడ్డి,మెట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love