నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్పల్లి డైరీ ఫార్మ్ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం మద్యం లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంస మయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్కు ఇబ్బందులు నెలకొన్నాయి. ఇదే అదునుగా కొందరు వాహనదారులు మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.