లోక్‌సభ బరిలో ఉంటా

Lok Sabha will be present– మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
నవతెలంగాణ-హాలియా
వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ బరిలో ఉంటానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం హాలియాలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 ఏండ్లలో కాంగ్రెస్‌ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే తొమ్మిదేండ్లలో బీఆర్‌ఎస్‌ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని, దేశంలో తొమ్మిదేండ్లలో రూ.112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశారని అన్నారు. మోడీ, కేసీఆర్‌లు చేసిన అవినీతిపై ఒకరిపై మరొకరు మాట్లాడుతున్నారని, రైతుబంధు పేర మధ్య తరగతి రైతులకు డబ్బులిస్తూ లిక్కర్‌పై పెంచిన ధరలతో ఒక్క కుటుంబం నుండే రూ.40వేలు వసూలు చేస్తున్నారన్నారు. మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని గత ఎన్నికల్లో సవాల్‌ చేసినా స్వీకరించలేదన్నారు.ఉపఎన్నికలో జానారెడ్డిని ఓడించడానికి శత విధాలా ప్రయత్నం చేసినా దగ్గర ఫలితం సాధించారన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన వారసులను తయారు చేస్తున్నానని, ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని, తమ పార్టీ అధికారంలోకొస్తే 24గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలకు అండగా మేమంతా ఉంటామని చెప్పారు.

Spread the love