చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్ మృతి

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనగా, లారీ డ్రైవర్ మరణించిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్కనూర్ పట్టణ శివారులో 44వ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ అనిల్ కుమార్ (36) గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొనగా, లారీ స్టీరింగ్ లో ఇరుక్కుని అనిల్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
Spread the love