రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మ్యాడగోని బుచ్చయ్య గౌడ్

నవతెలంగాణ-వీణవంక
సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్న, సింగం సత్తయ్య గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు సంపునూరి మల్లేశం గౌడ్ లు ఇటీవల కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బుచ్చయ్య గౌడ్ కు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుచ్చయ్య గౌడ్ మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొంగోని పెద్ద రాజయ్యను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కోడూరి పరుశురాములు, కర్బుజా తిరుపతి, గోపగోని సారయ్య, గుడాల రాజేశం, కోల లక్ష్మణ్, మాచర్ల అంజయ్య, బుర్ర పరశురామలు, ముత్యం శంకర్, పల్లెర్ల కొమురయ్య, మేడగోని శ్రీనివాస్, బొమ్మగాని పరశురాములు, బొమ్మగాని వెంకటేశం, భూమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Spread the love