మేడమ్‌ సార్‌.. మేడమ్‌ అంతే

మేడమ్‌ సార్‌.. మేడమ్‌ అంతేరావు రమేష్‌ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్‌ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్‌ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్‌ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే’ను మేకర్స్‌ బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో రావు రమేష్‌ కుమారుడిగా అంకిత్‌ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద ‘మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే’ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ అభిమానిగా అంకిత్‌ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్‌ సినిమాల్లో హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు. ‘తొలి తొలి సారి తొలిసారి గుండె గంతులేస్తున్నదే!… మేడమ్‌ సారు మేడమ్‌ అంతే’ అంటూ సాగే ఈ పాటను గాయకుడు సిద్‌ శ్రీరామ్‌ పాడారు. కళ్యాణ్‌ నాయక్‌ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో ఆయన మరో స్థాయికి తీసుకువెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ‘తాజాగా సన్నాఫ్‌ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్‌ కొయ్య సాంగ్‌ విడుదల చేశాం. ఆయన పోషించిన పాత్రకు, అల్లు అర్జున్‌కి సినిమాలో చిన్న కనెక్షన్‌ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. లిధా మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’ అని చెప్పారు.

Spread the love