- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లీ మండలంలోని హసన్ టాక్లి గ్రామంలో ఈనెల 30న అన్న బహు సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డలు అందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విలాస్ కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. కావున భారీ సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. విగ్రహవిష్కరణ కార్యక్రమంలో భాగంగా 106 వ జయంతి ఉత్సవాలు ఈ నెల 30న ఆదివారం 12:00 గం”లకు జరుగుతాయని తెలిపారు.
- Advertisement -



