పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ – తొగుట
హోటల్ సరిగ్గా నడవక, అప్పులు పెరిగిపోయి, కలత చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాన్గల్ గ్రామానికి చెందిన ముత్తొల్ల కనకరాజు (27) గ్రామంలో హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ సరిగా నడవపోవడంతో, అంతకుముందు చేసిన అప్పులు పెరుగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక మానసిక ఆవేదనకు గురై ఫిబ్రవరి 1వ తేదీన తన హోటల్ వెనుక వైపు గల వేప చెట్టు కింద ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగిఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  వెంటనే చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరు గైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాటి నుండి చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య కల్పన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకొని పరిచి పరిశోధన ప్రారం భించినట్లు హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ తెలిపారు.
Spread the love