మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట 
మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం మండలం లోని తుక్కాపూర్ గ్రామంలో తుర్క కాశీంలు మద ర్ సాబ్ హుస్సేన్ కొడుకు మృతి చెందాడు. విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. అనంతరం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి, ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love