మారుతి సుజుకి జిమ్నీ విడుదల

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భారత మార్కెట్లోకి తన కొత్త ఎస్‌యువి జిమ్నీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.12.74 లక్షలుగా నిర్ణయించింది. ఐదు డోర్లు కలిగిన ఈ ఎస్‌యువి డెలివరీలను బుధవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. దీన్ని ఓల్డ్‌ కె15బి 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో రూపొందించగా.. లీటర్‌కు 16.94 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వెల్లడించింది. దీన్ని అత్యాధునిక ఫీచర్లతో ఆవిష్కరించినట్లు పేర్కొంది.

Spread the love