ముంబయి : ప్యూచర్ జెనరాలి ఇండియా కొత్తగా డిఐవై హెల్త్ పాలసీని ఆవిష్కరించింది. గురువారం ఆ సంస్థ ఎండి, సిఇఒ అనూప్ రౌ వర్చూవల్గా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సరికొత్త పాలసీ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందన్నారు. 20 మాడ్యులర్ ఫీచర్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ హెల్త్ పాలసీలో బీమా మొత్తానికి సమగ్ర కవరేజీ, రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ పొందడానికి వీలుందన్నారు. గరిష్టంగా 15 మంది కుటుంబ సభ్యులకు కవరేజీ పొంద వచ్చన్నారు. వినియోగదారులు వారి జీవిత అవసరాలకు అనుగుణంగా అత్యంత ఆవశ్యకమైన ఫీచర్లను ఎంచుకోవడానికి వీలుందన్నారు.