బీజాపూర్ సుక్మా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా బాసగూడలోని చిప్పూర్‌భట్టి ప్రాంతంలో సైనికులకు నక్సలైట్లుకు మధ్య జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. సైనికుల ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు డిప్యూటీ కమాండర్ సహా 6 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమైనట్లు, హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన నక్సలైట్లలో ఇద్దరు మహిళా నక్సలైట్ల మృతదేహాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా దళాల బృందం కోబ్రా 210, 205 సీఆర్పీఎఫ్, 229 బెటాలియన్లు , డీఆర్జీ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా సీఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్తులను చంపినట్టు తెలుస్తోంది.

Spread the love