గోనె ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన.
 – మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్
నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలోని మల్లారం, డబ్బగట్టు,చిన్నతూoడ్ల గ్రామాలకు చెందిన సుమారుగా 70 మంది మండల రైతు సమితి అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, సర్పంచ్ గొనె పద్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్  గులాబీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సిఎం  కేసీఆర్ ప్రవేశపెట్టిన మేపేపిస్టో, పుట్ట మంథని నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి, ఆర్థిక సహయాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. మంథని ఎమ్మెల్యేగా పుట్ట మదుకర్ అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ రామారావు, చిన్నతూoడ్ల సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love