ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు

– రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం
నవ తెలంగాణ – సిద్దిపేట
బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో పట్టణంలోని మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజయ్, మల్లారెడ్డిలు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కావ్య 470 కి 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా వర్షిత 467, సాయి అమూల్య రెడ్డి 466, వైష్ణవి 466, ఆకాష్ 466, సహస్ర 465, బైపిసి విభాగంలో కీర్తన 440 కి గాను 436, తబుసుం 421, సీఈసీలో రాజేష్ 500కి  466 మార్కులు సాధించినందుకు తెలిపారు. ఇంటర్ సీనియర్ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఆయుష్ సిద్ధిక్ 1000కి 988, సమవర్షిని 988, బైపీసీలో గౌతమి 970, సీఈసీలో తబస్సుమ్ 960 మార్కులు సాధించినట్లు తెలిపారు. జిల్లాతో పాటు, రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు.   ప్రణాళిక బద్ధంగా విద్యార్థులకు విద్యను బోధించడం, మంచి అధ్యాపకుల బోధన మూలంగానే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల సహకారం కూడా తమకు ఉందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
Spread the love