కార్మికులతో మే డే రోజు పనులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి

కార్మికుల దినోత్సవం మే డే రోజు కూడా కోందరు కాంట్రాక్టర్లు యదేచ్చగా ఉదయం వేకువజామున నుండి సాయంత్రం వరకు పనులను చేయించారు. మేడే కు కార్మికులకు సెలవులు ఇవ్వకుండా వారితోనే వెట్టిచాకిరీ చేయించారు. ఈ కార్మికులు సైతం తమ కాంట్రాక్టర్ లకు, మేస్త్రీ లకు ఏమి చేప్పకుండ ఏర్రటి ఎండను సైతం చుడకుండ పనులు చేస్తూ కనబడ్డారు. మే డే రోజు తమకు పని చేయోద్దని ఉన్న బలవంతంగా చేయిస్తారని వారు అవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోవడం లేదని వారన్నారు. ఇలాంటి వారిపై అదికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love