షెడ్యూల్ కులాల వసతి గృహంలో వైద్య పరీక్షలు

 నవతెలంగాణ- రామారెడ్డి
 మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల బస్తీ గృహంలో మంగళవారం స్థానిక పిహెచ్సి వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య క్యాంపులు నిర్వహించారు. వస్తి గృహంలోని 75 మంది విద్యార్థులకు గాను, 35 మంది విద్యార్థులకు జ్వరం, జలుబు, చర్మ వ్యాధి వంటి వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు చైతన్య, సిబ్బంది భీం, రమ్యశ్రీ, శ్రీహరి, దోమల శ్రీధర్, వార్డెన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love