నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని దయానంద్ నగర మంజునాథ శివాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఈ.ఆర్.ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఈరావత్రి రాజశేఖర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసినారు. శివుని ఆలయ నిర్మాణం కొరకు తన వంతు సహాయంగా గుడి నిర్మాణానికి చందా ఇవ్వడం జరిగింది,శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు, ప్రస్తుత మున్సిపాలిటీ కౌన్సిలర్స్ నర్మే నవీన్, కోడిగేల మల్లయ్య, సర్వసమాజ్ మాజీ అధ్యక్షులు పుప్పాల పోశెట్టి,సభ్యులు పుప్పాల జీవన్, పుప్పాల రాజశేఖర్, పుప్పాల శ్రీనివాస్,గోజురు శ్రీనివాస్, చిట్టి నరేష్, ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, కోండి రామచందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ను కలిసిన శివాలయ నిర్మాణ కమిటీ సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


