పిడుగుపాటుకు పాడి ఆవు మృత్యువాత

నవతెలంగాణ – బెజ్జంకి
పిడుగుపాటుకు పాడి ఆవు మృత్యువాత పడిన ఘటన అదివారం మండల పరిధిలోని గుండారం గ్రామంలో చోటుచేసుకుంది. రైతు మ్యాకల కుంటయ్య తన పాడి ఆవును వ్యవసాయ పోలం వద్ద భద్రపరచి ఇంటి వద్దకు తిరిగి వచ్చాడు. శనివారం రాత్రి సమయంలో పిడుగులతో వర్షం కురిసింది. పిడుగుపాటుకు పాడి ఆవు మృత్యువాత పడినట్టు రైతు కుంటయ్య అనుమానం వ్యక్తం చేశారు.సంబదిత అధికారులు మృత్యువాత పడిన పాడి ఆవుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.
Spread the love