నవతెలంగాణ-సిద్దిపేట
బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో పట్టణంలోని మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించి ప్రభంజనం సష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజరు, మల్లారెడ్డిలు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కావ్య 470 కి 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా వర్షిత 467, సాయి అమూల్య రెడ్డి 466, వైష్ణవి 466, ఆకాష్ 466, సహస్ర 465, బైపిసి విభాగంలో కీర్తన 440కి గాను 436, తబుసుం 421, సీఈసీలో రాజేష్ 500కి 466 మార్కులు సాధించినందుకు తెలిపారు. ఇంటర్ సీనియర్ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఆయుష్ సిద్ధిక్ 1000కి 988, సమవర్షిని 988, బైపీసీలో గౌతమి 970, సీఈసీలో తబ స్సుమ్ 960 మార్కులు సాధించినట్లు తెలిపారు. జిల్లాతో పాటు, రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోష ంగా ఉందన్నారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులకు విద్యను బోధించడం, మంచి అధ్యాపకుల బోధన మూలంగానే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల సహకారం కూడా తమకు ఉందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన కావ్య
భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు అండగా ఉంటానని సుతారి కావ్య తెలిపారు. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో తొగుట గ్రామానికి చెందిన సుతారి కావ్య ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470కిగాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కావ్య తండ్రి దేవేందర్ ఓ ప్రైవేట్ బీడీ కంపెనీలో టేకేదారుగా పనిచేస్తున్నారు. తల్లి లావణ్య హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ తమ కూతురు రాష్ట్రస్థాయిలో మెదటి స్థానంలో మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల చదివే ముఖ్యమని, వారికి మంచి విద్యను అందించడానికి కష్టపడుతున్నట్లు ఆయన తెలిపారు. తాము తొగుటలో ఉంటూ ఇద్దరు కుమారులు, కూతురు కోసం సిద్దిపేటలో రూము కిరాయి తీసుకొని చదివిస్తున్నామని తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.