హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు సమావేశం

నవతెలంగాణ- సిద్దిపేట : హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ కార్యకర్తలపై నమ్మకంతో కేసీఆర్‌ తొలి ఎన్నికల సభ ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గౌరవెల్లి ప్రాజెక్టును హుస్నాబాద్‌కు ఇచ్చిన గొప్పవరం అని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ అయిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయనున్నారు. అదేరోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గని ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హరీశ్‌రావు హుస్నాబాద్‌లో పర్యటించి, సభా ఏర్పాట్లను పరిశీలించారు.

Spread the love