- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్ది (కే ), హంపొలి, సెరపెల్లి తండాలకు చెందిన వ్యక్తులు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ క్రమంలో ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ఫార్డి కే సర్పంచ్ సత్యనారాయణ, మండల నాయకులు దత్తాత్రి, నగేష్, గంగా శేఖర్ బైంసా చెర్మన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



