గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో రూ. 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, ఎంపీపీ మానస తదితరులు పాల్గొన్నారు

Spread the love