సహారా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల 

నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల  బోధన్ రోడ్డు లోని ఎంపిరియల్ గార్డెన్ లో సహారా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సమావేశం లో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌ. ఎమ్మెల్యే గణేష్ బిగాల  మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. నిజామాబాద్ నగరం లో సామాన్య ప్రజలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. నిజామాబాద్ నగరం శాంతి భద్రత ల సమస్యలు లేవు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, డ్రైనేజి లు, కల్వర్టులు నిర్మించి వీధి లైట్లు ఏర్పాటు చేయడం తో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తాను. మీరంతా మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి దీవిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ ఏ అలీం, మాజీ డిప్యూటీ మేయర్ మాజాజ్ అలీ, నవీద్ ఇక్బల్, అబ్దుల్ కుద్దుస్, మతీన్ రియల్ అసోసియేషన్ సభ్యులు ఖలీమ్, అబేద్, అబ్రార్, అలీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love