యాదగిరి గుట్టకు రెండు బస్సులను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి భక్తుల దర్శనం కొరకు బస్సులను ఏర్పాటు చేసినారు మండలంలోని అంకాపూర్ ఎమ్మెల్యే స్వగృహం నుండి బుధవారం పట్టణ సిద్ధుల గుట్ట నుండి రెండు బస్సులలో యాదగిరి గుట్టకు గొట్టిముక్కల, మెట్టు పల్లి గ్రామస్థులు బయలుదేరినారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించబడిన యాదగిరి పుణ్యక్షేత్రం దర్శనం కోసం స్వయంగా రెండు బస్సులు ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసినారు. మాక్లూర్ మండలం గొట్టిముక్కల & మెట్టు పల్లి గ్రామం నుండి గ్రామస్థులు యాదగిరిగుట్ట దర్శనానికి ఉదయం సిద్ధులగుట్ట పై దర్శనం చేసుకున్న తర్వాత అల్పాహారం ఏర్పాటు చేసిన  యాదగిరిగుట్టకు సాగనాంపరు. చరిత్రాత్మక కట్టడం శ్రీ యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లే భక్తులకోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత ఖర్చులతో బస్ ఉచితంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love