ఎంపీ పదవికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా

నవతెలంగాణ -హైరదాబాద్: బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు తన రాజీనామాను లేఖను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కాగా, 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి రఘునందన్ రావుపై ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీ.. రెండింట్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎంపీ పదవికి రిజైన్ చేశారు.

Spread the love