సాక్షర స్కూల్ 10వ వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

– సన్మానించిన పాఠశాల కరస్పాండెంట్

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రైవేట్ సాక్షర హై స్కూల్ పదవ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే వెంట వచ్చిన ముఖ్య నాయకులకు పాఠశాల కరస్పాండెంట్ సందీప్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట పాల్గొన్న మద్నూర్ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే సన్నిహితుడు సాయి పటేల్ ఘనంగా సత్కరించారు. పాఠశాల పదవ వార్షికోత్సవ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు గారికి ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులు హాజరైనందుకు పాఠశాల కరస్పాండెంట్ సందీప్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Spread the love