ఎమ్మెల్యే కారుకు బైకు ఢీకొని వ్యక్తి మృతి

– మరొకరు పరిస్థితి విషమం
– ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం
నవతెలంగాణ – తలకొండపల్లి
మండల పరిధిలోని సోమవారం వెల్జాల్ గ్రామంలోని ప్రచారం ముగించుకొని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో మధ్యాహ్న సమయంలో వెల్జాల్ గ్రామ శివారులో గల రామసిపల్లి మైసమ్మ దేవాలయ సమీపంలో మిడ్జిల్ రహదారి పై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారుకు మిడ్జిల్ నుంచి ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీ ఢీకొనడం జరిగింది. పబ్బతి నరేష్ (25) అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు బైరవపాక పరుశరాములు (35) పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో 10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం జరిగింది. అంబులేసు ద్వారా కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు,ఎమ్మెల్యే తో పాటు కారులో ఉన్న గన్మెన్లు, పిఏ ప్రాణభయంతో బయటపడడంతో అందరూ ఊపిరి పిలుచుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు, ఎమ్మెల్యే కు అక్కడ చికిత్స అందిస్తున్నారు.గాయపడ్డ వారిని ఎమ్మెల్యే స్వయంగా అక్కడ ఉండి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా ఎమ్మెల్యే తరలించారు.
Spread the love