గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం 

నవతెలంగాణ – ఆమనగల్ 
కడ్తాల్ మండల శివారులో గల మక్తమాధారం వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు కడ్తాల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెల్పిన వివరాల ప్రకారం తేది 29-04-2024 సోమవారం రాత్రి అందాజ (40 నుంచి 45) వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని మక్తమాధారం వెంచర్లో కాల్చి పడవేసినట్టు గుర్తించామన్నారు. మృతుని శరీరంపై ఈసా కంపెనీకి చెందిన ఫుల్ అండర్వేర్ ఉన్నట్టు, కింది వరుసలో సందు పండ్లు ఆయన తెలిపారు. శవం ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తే ఎక్కడో చంపేసి ఇక్కడ పడవేసినట్టు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.  ఈమేరకు మక్తమాధారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంటే కడ్తాల్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. అందుకోసం 8333993536,8712568298, 9493628100 నెంబర్ లకు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.
Spread the love