విద్యుదాఘాతంతో విలేఖరి మృతి

నవతెలంగాణ – పెద్దవంగర
విద్యుదాఘాతంతో ఓ విలేకరి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలోని కొరిపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్లపల్లి నవీన్ (36) ఓ దినపత్రిక లో విలేకరిగా పని చేస్తూ, తనకున్న కొద్దిపాటి పొలంతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసి, పైకి ఎక్కుతున్న క్రమంలో పేలిపోయిన కరెంట్ తీగలు మోచేయికి తాకాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కు భార్య సప్న, ఇద్దరు కుమారులు ఆయన్స్ అరియాన్ ఉన్నారు.
Spread the love