చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

– వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు
నవతెలంగాణ – పెద్దవంగర
వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అవుతాపురం గ్రామంలో జన వికాస ఆధ్వర్యంలో, వెలపాటి సులోచన దేవి తన భర్త రాంరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ సర్పంచ్ సలిదండి మంజుల తో కలిసి వైస్ ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన సులోచన దేవి చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జన వికాస కో ఆర్డినేటర్ శైలజ, శోభ రాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love