నవతెలంగాణ – నిజామాబాద్ : నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపింది అని కవిత మండిపడ్డారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్ చేశారు.తెలంగాణను పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే వాళ్ల అభద్రతా భావం కనిస్పిస్తుంది. అందుకే సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, రైతులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. రైతుబంధు ఆపాలన్న కాంగ్రెస్ పార్టీకి రైతులు తగినబుద్ది చెప్తారన్నారు. పేదలకు రేషన్ బియ్యం, ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు, మిషన్ భగీరథ తాగునీరు, ఇండ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి.. ఈ పథకాలన్నింటినీ ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందా..? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది కదా.. కాంగ్రెస్ వాళ్ల ఇండ్లకు కూడా కరెంట్ ఆపాల్సిన అవసరం ఉందన్నారు కవిత. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 2010లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీలను చేర్చకుండా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.