ప్రధాని పదవికి మోడీ రాజీనామా

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు.  మోడీ రాజీనామాను  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  వెంటనే  ఆమోదించారు. అయితే అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి కోరారు.    మరో వైపు జూన్ 5న సాయంత్రం ఎన్డీయే నేతల కీలక సమావేశం ఉంది. ఇప్పటికే ఎన్డీయే నేతలు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లనున్నారు.  సాయంత్రం జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు.

Spread the love