కాంగ్రెస్ పార్టీలో చేరిన మోగా ఎంపిటిసి, ఆ గ్రామ ఉపసర్పంచ్..

– ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మోగా ఎంపిటిసి, ఆ గ్రామ ఉపసర్పంచ్,

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సమక్షంలో డోంగ్లి మండలంలోని మోగా గ్రామ ఎంపీటీసీ గంగామణి కుమారుడు నారాయణ ఆ గ్రామ ఉపసర్పంచ్ నాగనాథ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఈ నెల 18న జరిగే అవిశ్వాసానికి మరింతగా బలం చేకూరింది. ఈ చేరిక కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దీని దయాల్ మొగ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love