- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం ఈసి స్వామిదాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా నర్సరిని కూడా సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను నిత్యం రెండు పూటలు నీటిని తప్పక అందించాలని ఎఫ్ ఏ ను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఈసి స్వామిదాస్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



