అవినీతి జరిగితే చర్యలు తప్పవు- ఎంపీఓ ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో తాళం వేసిన స్టోర్ రూమ్ గదిలో నుండి బోరు మోటర్ పోవడంతో వార్డు సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బోరు మోటర్ చోరీ, తీర్మానం లేకుండా బిల్లుల జారీ విషయంలో విచారణ జరుగుతుందని, అవినీతి జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love