సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి జాంగీర్ కు నేలపట్ల ఎంపీటీసీ నెల జీతం విరాళం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి సోమవారం రాత్రి భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జాంగీర్ విచ్చేసిన సందర్భంగా గ్రామ మహిళలు తిలకం దిద్ది హారతితో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామసభ నిర్వహించారు. నేలపట్ల ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత నెల జీతం రూ.6500 మాజీ సర్పంచ్ తడక రామాంజనేయులు పదివేల రూపాయలు ఎన్నికల ఖర్చులను సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జాంగీర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జాంగీర్ విజయాన్ని కాంక్షిస్తూ ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ జిల్లా కమిటీ సభ్యులు బూరుగు  కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్ గౌడ్  శాఖ కార్యదర్శి దెబ్బటి బక్కయ్య సహాయ కార్యదర్శి యనమల సంజీవ పార్టీ నాయకులు బుట్టి కృష్ణ గుర్రం ప్రమోద్ తడక శేఖర్ పుల్లయ్య గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love