లారీ వెనుక నుంచి ఢీకొట్టిన కారు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం బోర్రెలగూడెం స్టేజి వద్ద హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నపిల్లలు, నలుగురు పెద్దవాళ్ళులకు గాయాలయ్యాయి. కారు నుజ్జనుజ అయింది. మంగళవారం రాత్రి 2:30 గంటలకు సిమెంట్ లోడుతో హైదరాబాద్ వెళుతున్న AP 07 TM 3289 గల వాహనాన్ని అతివేగంగా దూసుకొచ్చి, లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో  TS 08 HC 8727 నెంబర్ గల కియా కారు లారీ వెనకాల భాగంలో దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహేందర్ తండ్రి నాగేశ్వరరావు వయసు:35 సంలు,వృత్తి: బిజినెస్, నిజాంపేట్, బాచుపల్లి. ఇతను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. దివ్య భర్త మహేందర్ వయస్సు:34 సంలు,గృహిణి. భార్గవ్ రావు తండ్రి మహేందర్ వయస్సు:6 సంలు.నరేష్ తండ్రి ఎర్ర ప్రసాద్, వయస్సు:35 సంలు,వృత్తి:సాఫ్ట్ వేర్ ఇంజనీర్, పల్లవరం గ్రామం,కృష్ణాజిల్లా.మౌనిక భర్త నరేష్,నికేత తండ్రి నరేష్ వయస్సు:3 సంలుగా గుర్తించి కేసు నమోదు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి తెలిపారు.
Spread the love