భారత రాజ్యాంగ రక్షణకై బీజేపీని ఓడించండి: ఫైళ్ళ ఆశయ్య

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపుని కాంక్షిస్తూ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి కూలీల సమావేశాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ.. కేంద్ర్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ, నిధులు ఇవ్వాకుండా ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని రాజ్యాంగంగా చేయాలని ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగ రద్దుకు పునుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రభుత్వ సంస్థలను సామాజిక న్యాయాన్ని,రిజర్వేషన్లను నిలబెట్టు కోవాలంటే బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు కొనసాగిస్తున్న ఈ పార్టీలను కూడా ఓడించి నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజాసేవ కోసం 35 ఏళ్లుగా మడమ తిప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎండి జాంగీర్ ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు స్థానిక ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం చినకొండూరు శాఖ కార్యదర్శి ఆధిమూలం నందీశ్వర్ మాజీ సర్పంచ్ ఎలకరాజు యాదగిరి గ్రామ నాయకులు చెక్క పాపయ్య,నత్తి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love