వేసిన సెలవుల్లోనూ వసతి గృహాలను తెరిచి ఉంచాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ఆధ్వర్యంలో వేసవికాలంలో తెలంగాణ యూనివర్సిటీ లోని వసతి గృహాలను తెరిచి ఉంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి  అధ్యక్షుడు శ్రీను రాథోడ్ అద్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలో చదివే విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న కారణంగా వేసవికాలంలో వారికి ఇబ్బంది కలగకుండా వసతి గృహాలను తెరిచి ఉంచాలని, అదేవిధంగా మెస్ బిల్లులు కూడా యూనివర్సిటీయే భరించాలని కోరారు. అంతేకాకుండా వైఫై, వాటర్ సౌకర్యాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మోహన్ నాయక్, ప్రవీణ్ కుమార్, మౌసిన్, రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love