రాజకీయ వ్యాపారస్తులను ఓడించి జహంగీర్ ను గెలిపించాలి: చెరుపల్లి సీతారాములు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రాజకీయ  వ్యాపారస్తులను ఓడించాలని సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డి గూడెంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో పుట్టి 35 సంవత్సరాల నుండి అనేక ప్రజా ఉద్యమాల్లో పని చేసిన వ్యక్తి చిన్నతనం నుండే విద్యార్థి యువజన మహిళ అంటరానితనం వివక్షతకు వ్యతిరేకంగా గిరిజనుల,మైనార్టీల హక్కుల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేసి భువనగిరి నియోజకవర్గ ప్రజలను కాలుష్యం బారి నుండి కాపాడాలని పంటలు ఆహార ధాన్యాలు తాగునీరు కలుషితం కాకుండా చూడాలని భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేసి పోరాటాలు చేసి ప్రజా సమస్యలపై గలమెత్తిన వ్యక్తి ఎండి జాంగీర్ అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అవకాశవాద కాంగ్రెస్ ను మతోన్మాద బీజేపీని ఏర్పాటు వాద బీఆర్ఎస్ ని ఓడించాలని, ఒక్కసారి సీపీఐ(ఎం) పార్టీకి అవకాశం కల్పించాలని, ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు మున్సిపాలిటీ కార్యదర్శి బండారు నరసింహ, మండల నాయకులు గోశిక కరుణాకర్,గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి,బాలరాజు,బి నరసింహ,వెంకటేశం దొడ్ల అండాలు,నాగలక్ష్మి దొడ్ల శంకరయ్య,బిక్షం బాబు తదితరులు పాల్గని ప్రచార రం ముమ్మురంగా నిర్వహించారు.
Spread the love