నవతెలంగాణ – బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజల్వ్ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో అతడిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడంతో కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే కాకుండా బాధిత మహిళలు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరింత జఠిలమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ హాసన లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.