నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన జంగం సుజాత రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిరుపేద కుటుంబం కావడంతో తన భార్య ఆస్పత్రి ఖర్చులకోసం దాతలు సహకరించి ఆదుకోవాలని సుజాత భర్త జంగం శ్రీనివాస్ కోరారు. ఇందుకు స్పందించిన గ్రామానికి ఉన్న పలువురు యూత్ సభ్యులు గురువారం రూ.25వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.2006-07 స్థానిక పదవ తరగతి బ్యాచ్ మేట్స్ అంతా కలిసి రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేయగా, గ్రామానికే చెందిన ఈగల్స్ యూత్ 2013౼14 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.5వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయం మొత్తాన్ని శ్రీనివాస్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు అందించారు.తన భార్య వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందించి సహకరించినయూత్ సభ్యులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.