నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్మీ హెలికాప్టర్ ఏఎల్హెచ్ ధృవ్లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో పైలట్ అప్రమత్తమై దాన్ని పంటచేనులో దించాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోగల ఓ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఆర్మీ టెక్నీషియన్స్ దానిలోని లోపాన్ని తాత్కాలికంగా సరిదిద్దారు. లోపాన్ని సరిచేసిన తర్వాత హెలికాప్టర్ నాసిక్ మిలిటరీ స్టేషన్కు బయలుదేరి వెళ్లిందని ఆర్మీ అధికారులు తెలిపారు.